టీటీడీ స్థలాల కబ్జాకు కుట్ర: టీడీపీ

ABN , First Publish Date - 2021-04-11T09:29:24+05:30 IST

టీటీడీ స్థలాల కబ్జాకు కుట్ర: టీడీపీ

టీటీడీ స్థలాల కబ్జాకు కుట్ర: టీడీపీ

తిరుపతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సీఎం బంధువర్గం టీటీడీ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రణాళికలు వేసుకుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ముంబయికి చెందిన ఉద్వేగ్‌కి ఇవ్వనున్న స్థలాన్ని టీడీపీ నాయకులు శనివారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం మాట్లాడారు. రూ.కోట్లు విలువచేసే టీటీడీ స్థలాన్ని కబ్జా చేసేందుకు సీఎం అనుచరులు కుట్రపన్నారని ఆరోపించారు. తక్షణం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-04-11T09:29:24+05:30 IST