హాఫ్ టికెట్ జగన్ ఏం చదవాడో ఎవరూ చెప్పరే: Anam

ABN , First Publish Date - 2022-06-22T17:49:04+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతనిధి ఆనం వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు.

హాఫ్ టికెట్ జగన్ ఏం చదవాడో ఎవరూ చెప్పరే: Anam

నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతనిధి ఆనం వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘హాఫ్ టికెట్ జగన్ మోహన్ రెడ్డి ఏం చదివాడో చెప్పమంటే ఒక్కరూ నోరు మెడపడంలేదు. జగన్ పది కూడా పాసయ్యాడో.. లేదో? ఇంటర్ ఫెయిలయ్యాడు. చదువురాని పప్పు.. జగన్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ శాఖ చేసే కాకాణికి టీడీపీ నేత లోకేష్ చదువు తెలుసా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో అమెరికాలో లోకేష్‌కు ఇచ్చిన ఎంబీఏ సర్టిఫికెట్‌ను మీడియాకు ఆనం విడుదల చేశారు. ఆత్మకూరు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లేకుండానే అధికార పార్టీకి చమటలు పట్టాయన్నారు. 16 మంది మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు ఆత్మకూరు ఉపఎన్నికలకు చమటోడ్చారని తెలిపారు. ‘‘కౌంటింగ్ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు నెల్లూరుకి రావాలని కోరుతున్నాను. లక్ష ఓట్లు మెజార్టీ వస్తే... పొట్టేళ్లు కోసి మా ఇంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భోజనం పెడుతా’’ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. 

Updated Date - 2022-06-22T17:49:04+05:30 IST