వెలిగొండ ప్రాజెక్టును జగన్ పట్టించుకోవటం లేదు
ABN , First Publish Date - 2021-08-26T22:53:59+05:30 IST
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని
ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. కేంద్ర జలవనరుల శాఖ విడుదల చేసిన గెజిట్లో అనుమతులు లేని ప్రాజెక్టుగా వెలిగొండ ఉందని ముద్రించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని ఆయన తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం జగన్ పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్లో పెట్టేందుకు జగన్ కృషి చేయాలని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి కోరారు.