కొట్టాలచెరువు గూడెంలో టీబీ సర్వే
ABN , First Publish Date - 2021-05-13T05:53:23+05:30 IST
మండలంలోని కొట్టాలచెరువు చెంచుగూడెంలో బుధవారం టీబీ వ్యాధిపై సర్వే నిర్వహించారు
ఆత్మకూరు రూరల్, మే 12: మండలంలోని కొట్టాలచెరువు చెంచుగూడెంలో బుధవారం టీబీ వ్యాధిపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ సూపర్వైజర్ రవికుమార్ మాట్లాడుతూ.. 15 రోజులకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీప ప్రాథమిక వైద్యకేంద్రాల్లో చికిత్సలు చేయించుకోవాలని తెలిపారు. ఇదిలావుంటే చెంచు కరోనా వ్యాధి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ రాధ, ఆశ కార్యకర్తలు దర్గమ్మ, సరళ ఉన్నారు.