పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T07:06:36+05:30 IST

పట్టణాల్లో ఆస్తి పన్ను,మంచినీటి పన్ను, చెత్తపై పన్నులు పెంచుతూ విడుదల చేసిన 196, 197, 198 జీవోలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్‌)న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలపై అదనపు భారాలు మోపి వారి జీవితాలను దుర్భరం చేయబోతున్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలి
కార్పొరేషన్‌ ఎదుట నిరసన తెలియజేస్తున్న న్యూ డెమోక్రసీ ప్రతినిధులు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 21 : పట్టణాల్లో ఆస్తి పన్ను,మంచినీటి పన్ను, చెత్తపై పన్నులు పెంచుతూ విడుదల చేసిన 196, 197, 198 జీవోలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్‌)న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలపై అదనపు భారాలు మోపి వారి జీవితాలను దుర్భరం చేయబోతున్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎంఎల్‌) జిల్లా నాయకులు ఎస్‌.లలిత కుమారి, జిల్లా నాయకులు కొంగర నరసింహం  , పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. పద్మ, స్త్రీ విముక్తి కార్యదర్శి శాంతకుమారి, రైతుకూలీ సంఘం నాయకులు రమణయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరావు, సీఎస్‌, సాగర్‌, పిచ్చయ్య, ఎంఎ్‌స.సాయి పలువురు పాల్గొన్నారు. అనంతరం కమిషనరు కే. భాగ్యలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. 


Updated Date - 2021-06-22T07:06:36+05:30 IST