రామయ్యను దర్శించిన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌

ABN , First Publish Date - 2021-10-20T05:04:24+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆదాయపన్ను శాఖ హైదరాబాద్‌ పరిపాలన విభాగం కమిషనర్‌ పీయూష్‌ సోనాకర్‌ సందర్శించారు.

రామయ్యను దర్శించిన ఆదాయపన్ను శాఖ కమిషనర్‌
ఆలయంలో ఆదాయపన్ను శాఖ కమిషనర్‌

భద్రాచలం, అక్టోబరు 19: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆదాయపన్ను శాఖ హైదరాబాద్‌ పరిపాలన విభాగం కమిషనర్‌  పీయూష్‌ సోనాకర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సమయంలో ఆలయ క్షేత్ర మహత్యాన్ని అర్చకులు ఆయనకు తెలియజేశారు. ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ పర్యవేక్షలు కత్తి శ్రీనివాస్‌, సీఐ టి.స్వామి ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రామాలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారికి మూలవరుల అభిషేకం పంచా మృతాలతో నిర్వహించారు. అనంతరం స్వామి వారిని అందంగా అలంకరించి ప్రసాద నివేదన చేశారు. రామాలయంలో నిర్వహించిన నిత్య కల్యాణంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:04:24+05:30 IST