సంపద సృష్టించలేకే ప్రజలపై పన్నుల భారం: టీడీపీ
ABN , First Publish Date - 2021-06-15T06:32:50+05:30 IST
సంపద సృష్టించటం చేత కాక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి, టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశ వరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డా రు.
బుక్కరాయసముద్రం, జూన 14: సంపద సృష్టించటం చేత కాక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి, టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశ వరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డా రు. సోమవారం వారు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లా డుతూ అధికారముందని ప్రభుత్వం ఇస్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అంటూ గొంతు చించుకున్న జగన అధికారంలోకి రాగానే ప్రజలుపై పన్నుల భారం మోపు తున్నారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో నిత్యావసర ధరలు బాగా పెరిగాయ న్నారు. వెంటనే పెంచిన పన్నుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.