మోదీతో టాటా సన్స్ చైర్మన్ భేటీ

ABN , First Publish Date - 2022-01-27T20:38:44+05:30 IST

ఎయిరిండియా దాదాపు ఏడు దశాబ్దాల అనంతరం

మోదీతో టాటా సన్స్ చైర్మన్ భేటీ

న్యూఢిల్లీ : ఎయిరిండియా దాదాపు ఏడు దశాబ్దాల అనంతరం తిరిగి టాటా గ్రూప్ స్వాధీనం కాబోతున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం సమావేశమయ్యారు. అంతకుముందు DIPAM కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయం ఎయిర్‌లైన్స్ హౌస్‌కు చేరుకున్నారు. 


ఎయిరిండియా దాదాపు 69 సంవత్సరాల తర్వాత గురువారం అధికారికంగా టాటా గ్రూప్ స్వాధీనం కాబోతోంది. ఈ అధికారిక బదిలీ సందర్భంగా చంద్రశేఖరన్ ఢిల్లీకి చేరుకున్నారు. 


ఎయిరిండియా 101 డెస్టినేషన్స్‌కు విమానాలను నడుపుతున్నట్లు 2020నాటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. దేశీయంగా 57 గమ్యస్థానాలకు వైమానిక సేవలను అందిస్తోంది. నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తోంది. 


(DIPAM = పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ)


Updated Date - 2022-01-27T20:38:44+05:30 IST