ఈఎంఐల చెల్లింపుల్లో ఆర్నెల్ల విరామం
ABN , First Publish Date - 2020-07-12T06:24:54+05:30 IST
ఎంపిక చేసిన కొన్ని మోడల్ వాహనాల కొనుగోలుపై టాటా మోటార్స్ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకం ప్రవేశపెట్టింది. టియాగో, నెక్సాన్, ఆలో్ట్రజ్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కరూర్ వైశ్యా బ్యాంక్...
- టాటా మోటార్స్ సరికొత్త ఆఫర్
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన కొన్ని మోడల్ వాహనాల కొనుగోలుపై టాటా మోటార్స్ ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకం ప్రవేశపెట్టింది. టియాగో, నెక్సాన్, ఆలో్ట్రజ్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ)తో కలిసి టాటా మోటార్స్ ఈ ఫైనాన్స్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన ఉద్యోగులు లేదా స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తులు జీరో డౌన్ పేమెంట్తో ఈ వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కంపెనీ వీరికి కేవీబీ ద్వారా ఐదేళ్ల కాల పరిమితితో కూడిన వాహన రుణాన్ని అందిస్తుంది. పథకంలో భాగంగా వీరు ఆరు నెలల వరకు నెలనెలా వడ్డీ తప్ప, ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు.