ఈఎంఐల చెల్లింపుల్లో ఆర్నెల్ల విరామం

ABN , First Publish Date - 2020-07-12T06:24:54+05:30 IST

ఎంపిక చేసిన కొన్ని మోడల్‌ వాహనాల కొనుగోలుపై టాటా మోటార్స్‌ ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ పథకం ప్రవేశపెట్టింది. టియాగో, నెక్సాన్‌, ఆలో్ట్రజ్‌ కార్లు కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కరూర్‌ వైశ్యా బ్యాంక్‌...

ఈఎంఐల చెల్లింపుల్లో ఆర్నెల్ల విరామం

  • టాటా మోటార్స్‌ సరికొత్త ఆఫర్‌ 


న్యూఢిల్లీ: ఎంపిక చేసిన కొన్ని మోడల్‌ వాహనాల కొనుగోలుపై టాటా మోటార్స్‌ ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ పథకం ప్రవేశపెట్టింది. టియాగో, నెక్సాన్‌, ఆలో్ట్రజ్‌ కార్లు కొనుగోలు చేసే కస్టమర్ల  కోసం  కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కేవీబీ)తో కలిసి టాటా మోటార్స్‌ ఈ ఫైనాన్స్‌ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన ఉద్యోగులు లేదా స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తులు జీరో డౌన్‌ పేమెంట్‌తో ఈ వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం కంపెనీ వీరికి కేవీబీ ద్వారా ఐదేళ్ల కాల పరిమితితో కూడిన వాహన రుణాన్ని అందిస్తుంది. పథకంలో భాగంగా వీరు ఆరు నెలల వరకు నెలనెలా వడ్డీ తప్ప, ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. 


Updated Date - 2020-07-12T06:24:54+05:30 IST