టాటా కార్లు ప్రియం

ABN , First Publish Date - 2022-01-19T05:56:18+05:30 IST

బుధవారం (19వ తేదీ) నుంచి తమ ప్యాసింజర్‌ వాహన ధరలను పెంచుతున్నట్లు

టాటా కార్లు ప్రియం

న్యూఢిల్లీ: బుధవారం (19వ తేదీ) నుంచి తమ ప్యాసింజర్‌ వాహన ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. సరాసరి పెంపు 0.9 శాతంగా ఉండనుందని తెలిపింది. ఈనెల 18న  లేదా అంతకు ముందు బుక్‌ చేసిన కార్లకు ఈ పెంపు వర్తించదని స్పష్టం చేసింది. వాహన ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడం వల్ల కొంత భారాన్ని కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది.


Updated Date - 2022-01-19T05:56:18+05:30 IST