మరి..మగాళ్లు సగం దుస్తులు ధరిస్తే?
ABN , First Publish Date - 2021-06-23T09:23:40+05:30 IST
మహిళల వస్త్రాధారణ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
ఇమ్రాన్ వ్యాఖ్యలపై తస్లీమా ఫైర్
న్యూఢిల్లీ, జూన్ 22: మహిళల వస్త్రాధారణ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్పై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ మండిపడ్డారు. ‘‘ఓ మగాడు పాక్షికంగా దుస్తులు ధరిస్తే.. మహిళలు రోబోలుకాని పక్షంలో.. ఆ దుస్తుల ప్రభావం మహిళలపై ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల ఇమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో.. ‘‘మహిళలు పాక్షికంగా దుస్తులు ధరిస్తే.. రోబోలు కానిపక్షంలో ఆ ప్రభావం పురుషులపై ఉంటుంది. ఇది సామాన్యంగా బోధపడే విషయమే. అసభ్యతే అత్యాచారాలకు కారణం’’ అని అనడంతో దుమారం రేగింది.