జగిత్యాలలో జంక్షన్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-27T06:08:33+05:30 IST
:జంక్షన్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త, పాత బస్టాండ్ సర్కిల్లో చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులను గురువారం అధికారులతో కలిసి చైర్ పర్సన్ శ్రావణి పరిశీలించారు.
పనులు పరిశీలిస్తున్న చైర్పర్సన్ శ్రావణి -(52జెజిటి2ల
- బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి
జగిత్యాల టౌన్, మే 26 :జంక్షన్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త, పాత బస్టాండ్ సర్కిల్లో చేపడుతున్న జంక్షన్ల అభివృద్ధి పనులను గురువారం అధికారులతో కలిసి చైర్ పర్సన్ శ్రావణి పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పట్టణ సుందరీకరణపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. నాయకులు మొగిలి, ప్రవీణ్, పవన్, ఏఈ శరణ్, టీపీఎస్ శ్యాం సుందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్లం తదితరులు ఉన్నారు.