రెండు రోజుల్లో పనులు పూర్తి చేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-07-02T10:53:57+05:30 IST
జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీకి సంబంధించి పనులన్నీ రెండు రోజుల్లో పూర్తి చేయా లని కలెక్టర్ రేవు ముత్యాలరాజు
ఏలూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీకి సంబంధించి పనులన్నీ రెండు రోజుల్లో పూర్తి చేయా లని కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం ఇళ్ల పట్టాలు, ఉపాధి హామీ పనులు, వైఎస్ఆర్ చేయూత, నాడు నేడు, రైస్ కార్డులు అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ అధికారులతో వీడియో కాన్ఫ రెన్సు ద్వారా సమీక్షించారు.