Telangana: తండ్రిని కర్రతో మోది చంపిన కూతురు

ABN , First Publish Date - 2022-04-29T15:43:05+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కూతురు కర్రతో మోది చంపేసింది.

Telangana: తండ్రిని కర్రతో మోది చంపిన కూతురు

మహబూబాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కూతురు కర్రతో మోది చంపేసింది. మహబూబాబాద్ మండలం వేమునూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి ధ్రువ పత్రాలు తండ్రి ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న(46)ను కూతురు ప్రభావతి(17) కర్రతో కొట్టి చంపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-29T15:43:05+05:30 IST