డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీ రూ.731.37 కోట్లు
ABN , First Publish Date - 2021-02-25T08:02:51+05:30 IST
డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీగా రూ.731.37 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్లకు టారిఫ్ సబ్సిడీగా రూ.731.37 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరికిగాను ఎత్తిపోతల పథకాల కరెంట్ చార్జీలతోపాటు 24లక్షలకుపైగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు రాయితీతో విద్యుత్ను అందిస్తున్నందుకు ఈ నిధులను విడుదల చేస్తూ ఇంధన శాఖ కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.