దేవినేని విషయంలో పోలీసుల వైఖరి సమంజసమేనా?

ABN , First Publish Date - 2021-07-30T01:43:50+05:30 IST

దేవినేని విషయంలో పోలీసుల వైఖరి సమంజసమేనా?

దేవినేని విషయంలో పోలీసుల వైఖరి సమంజసమేనా?

కృష్ణా: మైలవరంలో మైనింగ్ అక్రమాలు జరిగాయంటూ పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుంటుపల్లి వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ డ్రైవర్‌ దాసరి సురేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై.. పోలీసులు ఉమా, మరో 17 మందిపై 18 సెక్షన్లు.. ఐపీసీ 109, 120బి, 147, 148, 149, 188, 307, 323, 324, 332, 341, 353, 427, 506 ఐపీసీ 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌), 3(2)(వి), ఎస్సీ, ఎస్టీ పీవోఏ యాక్ట్‌, 3 ఈడీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లు పెట్టడంపై పోలీసులతో పాటు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవినేని ఉమను వైసీపీ నేతలు అడ్డుకుని అలజడి రేపితే రివర్స్‌లో కేసులు పెట్టడం చోద్యమని టీడీపీ నేతలు అంటున్నారు. పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘మాజీ మంత్రి దేవినేని విషయంలో పోలీసుల వైఖరి సమంజసమేనా?.ప్రతిపక్షాలు క్షేత్ర పరీశీలనకు వెళ్లడం చట్ట విరుద్ధమా?. అక్రమాలు జరగలేదనే ధీమా ఉంటే విపక్షాలను అడ్డుకోవడం ఎందుకు?. దేవినేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా?. టీడీపీ సీనియర్లను ఒక్కొక్కరినీ టార్గెట్ చేయడం జగన్ వ్యూహంలో భాగమా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-07-30T01:43:50+05:30 IST