అతణ్ణి మరోసారి అదృష్టం వరించింది!

ABN , First Publish Date - 2020-08-09T22:53:21+05:30 IST

టాంజానియాలోని గనుల్లో పని చేసే సనెన్యూ లైజర్ అనే వ్యక్తిని అదృష్టం మరోసారి వరించింది. తాజాగా ఆయనకు మరో రత్నం దొరికింది. దీంతో ఆయన సంతోషా

అతణ్ణి మరోసారి అదృష్టం వరించింది!

టాంజానియా: టాంజానియాలోని గనుల్లో పని చేసే సనెన్యూ లైజర్ అనే వ్యక్తిని అదృష్టం మరోసారి  వరించింది. తాజాగా ఆయనకు మరో రత్నం దొరికింది. దీంతో ఆయన సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. టాంజానియాకు చెందిన సనెన్యూ లైజర్ అనే వ్యక్తి.. గనులు తవ్వే పని చేస్తూ.. తన భార్య, పిల్లలను పోషించుకునే వాడు. ఈ క్రమంలో.. ఈ ఏడాది జూన్‌లో ఆయనకు.. అరుదైన, అతివిలువైన రెండు టాంజానైట్ రత్నాలు దొరికాయి. వాటిని ప్రభుత్వానికే విక్రయించి.. దాదాపు రూ. 25కోట్లు సంపాదించాడు. దీంతో లైజర్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనప్పటికీ.. ఎప్పటిలాగే ఆయన పనికి వెళ్లాడు. ఈ క్రమంలో మన్యారాలోని గనుల్లో ఆయనకు తాజాగా మరో టాంజానైట్ రత్నం దొరికింది. సుమారు ఆరు కిలలో బరువు ఉన్న ఆ రత్నం విలువ.. దాదాపు 2 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. కాగా.. దీనిపై స్పందించిన లైజర్.. సంతోషం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా రత్నాలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలకు రెండు పాఠశాలలను కట్టించనున్నట్లు తెలిపాడు. 


Updated Date - 2020-08-09T22:53:21+05:30 IST