పెట్రోల్ ధర మండిపోతోంది.. ఫ్రీగా దొరుకుతోందంటే ఊరుకుంటారా..? అందుకే ఇలా ఎగబడ్డారు..

ABN , First Publish Date - 2021-06-19T23:20:00+05:30 IST

ట్యాంకర్ నుంచి కారుతున్న పెట్రోల్‌ను తమ క్యాన్లలో నింపుకున్నారు

పెట్రోల్ ధర మండిపోతోంది.. ఫ్రీగా దొరుకుతోందంటే ఊరుకుంటారా..? అందుకే ఇలా ఎగబడ్డారు..

గ్వాలియర్ నుంచి షాపూర్ వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా పోహ్రి వద్ద అదుపుతప్పి తిరగబడింది.. ఆ యాక్సిడెంట్‌లో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడకు తండోపతండాలుగా వచ్చిన సమీప గ్రామ ప్రజలు వారిని పట్టించుకోలేదు.. ట్యాంకర్ నుంచి కారుతున్న పెట్రోల్‌ను తమ క్యాన్లలో నింపుకోవడం పైనే దృష్టి సారించారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ప్రస్తుతం పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.. ఇలాంటి తరుణంలో ఫ్రీగా వస్తుంటే ఎవరు ఊరుకుంటారు.. అందుకే ఇలా ఎగబడ్డారు. బకెట్లతోనూ, బాటిళ్లతోనూ, క్యాన్లతోనూ పట్టుకెళ్లిపోయారు. కొందరు డైరెక్ట్‌గా బైక్‌ల్లోనే నింపుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారందరినీ చెదరగొట్టారు. 

Updated Date - 2021-06-19T23:20:00+05:30 IST