ట్యాంకర్‌ను ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-04-27T15:36:30+05:30 IST

చెంగల్పట్టు సమీపంలో ట్యాంకర్‌ లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదురైకి చెందిన అశ్వినికుమార్‌ (28), ఆయన

ట్యాంకర్‌ను ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

చెన్నై: చెంగల్పట్టు సమీపంలో ట్యాంకర్‌ లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదురైకి చెందిన అశ్వినికుమార్‌ (28), ఆయన భార్య శివభాగ్యం (23), కుమార్తె దీవానా (2), ఆరు నెలల మగబిడ్డ కారులో సోమవారం నగరంలో బంధువుల ఇంటి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. మంగళవారం వేకువజామున వీరందరూ మళ్ళీ కారులో మదురై బయలుదేరారు. అశ్వినికుమార్‌ నడుపుతున్న కారు మధురాంతకం సమీపంలోని చెన్నై - తిరుచ్చి రహదారిలో అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి వున్న ట్యాంకర్‌ లారీని ఢీకొన్నది. ఈ సంఘటనలో అశ్వినికుమార్‌, ఆరునెలల మగబిడ్డ ఘటనా స్థలంలోనే మరణించారు. అశ్వినికుమార్‌ భార్య శివభాగ్యం, కుమార్తె దీవానా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలియగానే పట్టాలం పోలీసులు అక్కడికి చేరుకుని కారు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపారు.

Updated Date - 2022-04-27T15:36:30+05:30 IST