మైసన్నగూడెం చెరువు లీజు వివాదం

ABN , First Publish Date - 2021-10-26T04:52:00+05:30 IST

మైసన్నగూడెం చెరువు లీజుపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌ డిమాండ్‌ చేశారు.

మైసన్నగూడెం చెరువు లీజు వివాదం
వినతిపత్రం అందజేస్తున్న డీవైఎఫ్‌ఐ నేతలు

జంగారెడ్డిగూడెం, అక్టో బరు 25: మైసన్నగూడెం చెరువు లీజుపై అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌ డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ఇరిగేషన్‌ కార్యాలయంవద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. మైసన్నగూడెంలోని చెరువును గ్రామ సచివాలయం, గ్రామ సర్పంచ్‌, ప్రజలకు సమాచారం లేకుండానే కొందరు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ఇరిగేషన్‌ అధికారికి ఫిర్యాదు చేసినా చర్య లు తీసుకోవడం లేదని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందో ళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కె.సుబ్బారావు, జి.రామాంజనేయు లు, ఎం.సోమరాజు, టి.శేషయ్య, జి.రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:52:00+05:30 IST