ఎవరైనా.. ఢిల్లీ వెళ్లారా ?
ABN , First Publish Date - 2020-04-03T11:53:39+05:30 IST
: ఏలూరు రూరల్ మండలంలోని తంగెళ్ళ మూడి, వైఎస్ఆర్ కాలనీకి చెందిన వారికి కరోనా పాజిటివ్ నమోదవడంతో అధికారులు సర్వే ప్రారంభించారు.
గ్రామాల్లో విస్తృత తనిఖీలు.. ఆరా తీస్తున్న అధికారులు
ఏలూరు రూరల్, ఏప్రిల్ 2 : ఏలూరు రూరల్ మండలంలోని తంగెళ్ళ మూడి, వైఎస్ఆర్ కాలనీకి చెందిన వారికి కరోనా పాజిటివ్ నమోదవడంతో అధికారులు సర్వే ప్రారంభించారు. ఢిల్లీలో సదస్సుకు వెళ్ళి వచ్చిన వారిలో ఏలూరు తంగెళ్ళమూడికి చెందిన ఐదుగురు, వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు బయటపడింది. ఢిల్లీ వెళ్ళి వచ్చినవారు ఎక్కడెక్కడ పర్యటించారు..? వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారు అనే దానిపై అధికారులు, వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు.
ఎవరైనా ఢిల్లీ వెళ్ళి వస్తే స్వచ్ఛంధంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తంగెళ్ళ మూడి, వైఎస్ఆర్ కాలనీలో ప్రత్యేక పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గ్రామాలన్నింటిలోనూ వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ట్యాంకర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లిస్తున్నారు. డోర్టు డోర్ ఫైర్ ఇంజన్తో ఆరు ట్యాంకర్ల ద్వారా పిచికారీ చేయిస్తున్నారు.