భూవివాదంలో చిక్కుకున్న మంత్రి తానేటి వనిత

ABN , First Publish Date - 2021-11-20T22:06:43+05:30 IST

భూవివాదంలో మంత్రి తానేటి వనిత చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి వనిత, శివానంద మఠానికి మధ్య భూ వివాదం నెలకొంది. గతంలో 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి దాతలు ఇచ్చారు.

భూవివాదంలో చిక్కుకున్న మంత్రి తానేటి వనిత

పశ్చిమగోదావరి: భూవివాదంలో మంత్రి తానేటి వనిత చిక్కుకున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి వనిత, శివానంద మఠానికి మధ్య భూ వివాదం నెలకొంది. గతంలో 25 సెంట్ల భూమిని శివానంద మఠానికి దాతలు ఇచ్చారు. అదే భూమిలో వ్యాపార సముదాయానికి మంత్రి వనిత శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనను అడ్డుకోబోయిన బీజేపీ, అర్ఎస్ఎస్ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడారు. 2014లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశానని ఆమె చెప్పారు. 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్న వారెవరకి దగ్గర డా క్యుమెంట్స్ లేవన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ చేస్తున్నారని ఆమె అన్నారు. 

Updated Date - 2021-11-20T22:06:43+05:30 IST