ఘనంగా శివపార్వతుల కల్యాణం

ABN , First Publish Date - 2020-02-20T05:45:08+05:30 IST

తాండూరు-కొడంగల్‌ రోడ్డు మార్గంలోని భక్తమార్కండేయ దేవాలయంలో శివపార్వతుల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా దేవాలయ కమిటీ

ఘనంగా శివపార్వతుల కల్యాణం

తాండూరు : తాండూరు-కొడంగల్‌ రోడ్డు మార్గంలోని భక్తమార్కండేయ దేవాలయంలో శివపార్వతుల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా దేవాలయ కమిటీ, కాలనీ పద్మశాలీల ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం జరిగింది. వధువు పార్వతిదేవి తరపున దూస వెంకటస్వామి, లావణ్య దంపతులు, వరుడు శివుని తరపున అన్నపూర్ణ, కిరణ్‌ దంపతులు కూర్చుని కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నపరిమళ్‌, కౌన్సిలర్లు రీజన, రామకృష్ణ, శ్రీనివా్‌సరెడ్డి, కమిటీ సభ్యులు రాములు పాల్గొన్నారు.


Updated Date - 2020-02-20T05:45:08+05:30 IST