తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు

ABN , First Publish Date - 2021-06-20T05:52:13+05:30 IST

కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న తగాదాలు, అపోహలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

తండ్రిని గొడ్డలితో నరికిన కొడుకు
దహనమైన మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, వైద్యాధికారి


గుట్టుగా దహన సంస్కారాలు

కుటుంబ కలహాలే హత్యకు కారణం

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 19 : కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న తగాదాలు, అపోహలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తండ్రి సృష్టించే గొడవలకు తట్టుకోలేక కుమారుడు నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం గిద్దలూరు మండలం సంజీవరాయునిపే ట పంచాయతీ పరిధిలోని దంతెలపల్లె గ్రా మానికి చెందిన మోడి భాస్కర్‌ (52) వ్యవసా యం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి భా ర్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిత్యం మో డి భాస్కర్‌ మద్యం సేవించి వచ్చి తరచూ భా ర్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో కుమారుడి భార్యను కూడా తీవ్ర పదజాలంతో దూషించేవాడు. అటు తల్లిని, ఇటు తన భార్యను వేధిస్తున్న తండ్రిని కుమారుడు రంగప్రసాద్‌ మందలించేవాడు. అయినా పద్ధతి మారలేదు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి మద్యం సేవించి వచ్చిన భాస్కర్‌ కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. తరువాత గొడవ సర్దుమనిగి పడుకున్న తండ్రిని కుమారుడు రంగప్రసాద్‌ రాత్రి 11.30 గంటల సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. వెంటనే గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని శ్మశానవాటికలో దహన సంస్కారం నిర్వహించారు. ఈవిషయం గురించి పోలీసులకు ఫిర్యాదు రావడంతో సీఐ  ఎమ్‌డీ ఫిరోజ్‌, వైద్యాధికారి సూరిబాబు ఆప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-06-20T05:52:13+05:30 IST