నన్ను మహేందరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు: తాండూరు సీఐ

ABN , First Publish Date - 2022-04-28T17:32:26+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనపై అసభ్య పదజాలంతో దూషించారని తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు.

నన్ను మహేందరెడ్డి  అసభ్య పదజాలంతో దూషించారు: తాండూరు సీఐ

తాండూరు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తనపై అసభ్య పదజాలంతో దూషించారని తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ‘‘నాకు చాలా బాదేసింది. నాపై చేసిన వ్యాఖ్యాలు పై నేను ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేశారు, ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తారు. నేను ఇసుక మాఫియాకు, రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తున్నట్లు ఆరోపణలలో వాస్తవం లేదు. రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై వారి పేర్లు బయట పెట్టాలి. నేను లాంగ్ లీవ్‌లో వెళ్ళినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం, నేను ఆన్ డ్యూటీలోనే ఉన్నాను’’ అంటూ సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు. 


Updated Date - 2022-04-28T17:32:26+05:30 IST