TANA: పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి మృతి పట్ల డా. ప్రసాద్ తోటకూర సంతాపం

ABN , First Publish Date - 2022-07-23T18:55:17+05:30 IST

భారతదేశ జాతి గౌరవం అయిన మన జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్ కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి డా. మండలి బుద్ధప్రసాద్, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో ఆమె కుటుంబ సభ్యులకు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

TANA: పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి మృతి పట్ల డా. ప్రసాద్ తోటకూర సంతాపం

డాలస్, టెక్సాస్: భారతదేశ జాతి గౌరవం అయిన మన జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్ కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి డా. మండలి బుద్ధప్రసాద్, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో ఆమె కుటుంబ సభ్యులకు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. డా. మండలి బుద్ధప్రసాద్, డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ ఏడాది మే 10వ తేదిన మాచర్లలో నివాసముంటున్న శత వసంతాలు పూర్తి చేసుకున్న సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లాం. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించాము. ఆ తర్వాత సీతామహాలక్ష్మిని ఘనంగా సన్మానించి ఆమెకు పాదనమస్కారం చేసుకునే అవకాశం కలగడం మా అదృష్టం” అని అన్నారు. 


“100 సంవత్సరాల వయస్సులో కూడా ఏ మాత్రం చెరగని ఉత్సాహం, తరగని జ్ఞాపకశక్తితో అనేక విషయాలను ఆసక్తిగా పంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. వెంకయ్య మనవడు జీవీఎన్ నరసింహం ఆంగ్లం, తెలుగు భాషల్లో రాసిన ‘పింగళి వెంకయ్య జీవిత చరిత్ర’ పుస్తకాలను ఆ వయస్సులో కూడా ఆమె తన స్వహస్తాలతో సందేశం రాసి, సంతకంచేసి మరీ తమకు బహుమతులుగా ఇవ్వడం ఒక మధురానుభూతి” అని అన్నారు. పింగళి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సీతామహాలక్ష్మి ఆత్మకు భగవంతుడు సద్గతిని కల్గించాలని మండలి బుద్ధప్రసాద్, తోటకూర ప్రసాద్ కోరుకున్నారు. 





Updated Date - 2022-07-23T18:55:17+05:30 IST