దామా వెంకయ్య మృతి పట్ల ‘తానా’ సంతాపం
ABN , First Publish Date - 2020-10-02T04:13:10+05:30 IST
గతంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్గా వ్యవహరించిన దామా వెంకయ్య (85) గత నెల 30న న్యూయార్క్లో మృతి చెందారు. ఆయన మృతిపట్ల తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి, కార్యదర్శి పొట్లూరి రవి సంతాపం
వాషింగ్టన్: గతంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్గా వ్యవహరించిన దామా వెంకయ్య (85) గత నెల 30న న్యూయార్క్లో మృతి చెందారు. ఆయన మృతిపట్ల తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి, కార్యదర్శి పొట్లూరి రవి సంతాపం తెలిపారు. దామా వెంకయ్య కుటుంబ సభ్యులకు.. వారు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 1997-1999 మధ్య కాలంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్గా.. దామా వెంకయ్య చేసిన సేవలను వాళ్లు గుర్తు చేసుకున్నారు. తానాలో వివిధ హోదాల్లోనే కాకుండా టీఎల్సీఏ వంటి ఆర్గనైజేషన్లలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కాగా.. 1968లో అమెరికాకు వలస వెళ్లిన ఆయన.. 2005 వరకు న్యూయార్క్ సిటీలో సివిల్ ఇంజినీర్గా పని చేశారు.