బీబీనగర్‌ ఎయిమ్స్‌ను కొవిడ్‌ ఆస్పత్రిగా అనుమతించాలి: కిషన్‌రెడ్డికి తమ్మినేని లేఖ

ABN , First Publish Date - 2021-05-14T09:03:26+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌ను కొవిడ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించి, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర

బీబీనగర్‌ ఎయిమ్స్‌ను కొవిడ్‌  ఆస్పత్రిగా అనుమతించాలి: కిషన్‌రెడ్డికి తమ్మినేని లేఖ

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌ను కొవిడ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అనుమతించి, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్‌లో ఇన్‌పేషెంట్లకు వైద్యం అందించేందుకు అనుమతులు, అందుకు అవసరమైన ఎక్వి్‌పమెంట్‌ను కేంద్ర ప్రభుత్వం సమకూర్చకపోవడంతో ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోలేకపోతున్నారని గురువారం కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో తమ్మినేని పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను కరోనా వైద్యానికి వినియోగించుకోవడానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని, ఆక్సిజన్‌ ప్లాంటును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేట్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-14T09:03:26+05:30 IST