2వేలకు చేరువైన కరోనా మరణాలు.. 4వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2020-07-13T00:41:26+05:30 IST

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోల్చితే నేడు కేసులు మరింత...

2వేలకు చేరువైన కరోనా మరణాలు.. 4వేలకు పైగా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోల్చితే నేడు కేసులు మరింత పెరిగాయి. దాదాపు 4వేలకు పైగా కొత్త కేసులు బయపడ్డాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా38వేలు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది మరణించారు. 3,617 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,38,470కి చేరింది. వీరిలో 46,969మంది చికిత్స పొందుతుండగా 89,532మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 1966మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-13T00:41:26+05:30 IST