భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. పిల్లలకు ఊపిరాడకుండా చేసి.. ఆ వ్యక్తి ఉన్మాదిలా మారడం వెనకున్న కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-03T20:29:03+05:30 IST

రెండేళ్లుగా ఎదురవుతున్న కష్టాలు అతడిని ఉన్మాదిలా మార్చాయి.. భార్యను, పిల్లలను పొట్టనపెట్టుకునేలా చేశాయి..

భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. పిల్లలకు ఊపిరాడకుండా చేసి.. ఆ వ్యక్తి ఉన్మాదిలా మారడం వెనకున్న కారణం ఏంటంటే..

రెండేళ్లుగా ఎదురవుతున్న కష్టాలు అతడిని ఉన్మాదిలా మార్చాయి.. భార్యను, పిల్లలను పొట్టనపెట్టుకునేలా చేశాయి.. ఆత్మహత్యకు ప్రేరేపించాయి.. తమిళనాడులో జరిగిన ఈ ఘోరం ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది. చెన్నై‌లోని పెరుంగుడిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మణికందన్ (42) అనే వ్యక్తి పెరుంగుడిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.


ఆయనకు భార్య ప్రియ(36), కుమారులు ధరన్‌(10), దహన్‌(1) ఉన్నారు. ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న మణికందన్ జీవితం సాఫీగా సాగిపోయేది. అయితే రెండేళ్ల నుంచి మణికందన్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. విలాసాల కోసం అతను బ్యాంకు నుంచి, స్నేహితుల నుంచి తీసుకున్న అప్పులు, వాటి వడ్డీలు భారీగా పెరిగిపోయాయి. రోజురోజుకూ అవి భారంగా మారాయి. దీంతో మణికందన్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.  


ఆదివారం సాయంత్రం ఉన్మాదిలా మారి భార్య ప్రియను క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టి చంపేశాడు. అనంతరం పిల్లలకు తలగడతో ఊపిరి ఆడకుండా చేసి వారినీ చంపేశాడు. అనంతరం వంట గదిలో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.   


Updated Date - 2022-01-03T20:29:03+05:30 IST