పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల్లేవ్

ABN , First Publish Date - 2021-02-25T19:14:30+05:30 IST

ఈ మేరకు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి కీలక ప్రకటన చేశారు.

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల్లేవ్

తమిళనాడు: పాఠశాల విద్యార్థులకు తమిళనాడు సర్కార్ తీపి కబురు అందించింది. 9,10,11 తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణత చెందినట్టు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు ఎన్నికల వేళ... ప్రభుత్వ ఉద్యోగులకు వరం ప్రకటించారు. పదవీకాలం 60 ఏళ్లు పొడిగిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపారు.


Updated Date - 2021-02-25T19:14:30+05:30 IST