పారిపోయి వృద్ధురాలిని కొరికి!

ABN , First Publish Date - 2020-03-29T08:28:59+05:30 IST

తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇటీవల శ్రీలంక నుంచి వచ్చాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అతనికి 14 రోజుల హౌస్‌ క్వారంటైన్‌ విధించింది.

పారిపోయి వృద్ధురాలిని కొరికి!

తమిళనాట యువకుడి దారుణం


చెన్నై, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇటీవల శ్రీలంక నుంచి వచ్చాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అతనికి 14 రోజుల హౌస్‌ క్వారంటైన్‌ విధించింది. అయితే, సదరు యువకుడు శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో అతను నగ్నంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాదు, వెళ్తూ వెళ్తూ ఆ యువకుడు సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న వృద్ధురాలి(80)ని మెడ భాగంలో గట్టిగా కొరికాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందింది. కాగా, తప్పించుకున్న యువకుడిని ఎట్టకేలకు పట్టుకున్న గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-03-29T08:28:59+05:30 IST