16 జిల్లాలకు వర్షసూచన
ABN , First Publish Date - 2020-08-10T17:00:50+05:30 IST
16 జిల్లాలకు వర్షసూచన
చెన్నై: రానున్న 48 గంటల్లో 16 జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతవరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు ఆ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... ఉపరితల ఆవర్తనం కారణంగా సముద్రతీర ప్రాంతాలు, కోవై, నీలగిరి జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందన్నారు. వేలూరు, తిరువళ్లూర్, తిరుపత్తూర్, తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం, కరూర్, తిరుచ్చి, పుదుకోట, కన్నియకుమారి జిల్లాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందన్నారు. అలాగే, అరియలూరు, పెరంబ లూర్, మదురై, శివగంగ, రామనాథపురం, విరుదునగర్ జిల్లాల్లోను పుదుచ్చేరి, కారైక్కాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.