ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-10T18:04:15+05:30 IST

ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

చెన్నై: ఆన్‌లైన్‌ తరగతుల కోసం తల్లిదండ్రులు మొబైల్‌ ఫోన్‌ కొనివ్వకపోవడంతో ప్లస్‌ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగర శివారు ప్రాంతమైన రామాపురం పూత్తపేడు సమీపంలోని తిరుమలైనాయకర్‌ వీధికి చెందిన చిన్నయ్య, సువర్ణ దంపతుల కుమార్తె యామిని (17) ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్‌లో ఉపాధ్యా యులు పాఠాలు బోధిస్తున్నారు. యామిని తన చిన్నమ్మ మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ పాఠాలు నేర్చుకుంటుంది. ఈ క్రమంలో, తనకు ఫోన్‌ కొనివ్వాలని యామిని తల్లిదండ్రులను కోరగా, రెండ్రోజుల్లో కొనిస్తామని వారు చెప్పి వారమైనా ఫోన్‌ కొనివ్వలేదు. దీంతో ఆవేదన చెందిన యామిని అందరు నిద్రపోతుంగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-08-10T18:04:15+05:30 IST