ఏనుగు దంతాల స్వాధీనం
ABN , First Publish Date - 2020-08-10T18:02:24+05:30 IST
ఏనుగు దంతాల స్వాధీనం
చెన్నై: తిరుచెంగోడు సమీపంలో ఓ ఇంట్లో దాచిన రెండు ఏనుగు దంతాలను అటవీ శాఖ అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపం కడయం బత్తూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ఏనుగు దంతాలను దాచివున్నట్లు అందిన సమాచారంతో తిరుచెంగోడు పోలీసులు సతీష్కుమార్ ఇంట్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ 3 కిలోల బరువున్న రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వారి విలువ సుమారు రూ.2 లక్షలుం టుందని పోలీసులు తెలిపారు. ఈ దంతాలను జిల్లా అటవీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిం చారు. ఈ దంతాలను ఎలా సేకరించారో అన్న విషయమై విచారణ చేపట్టామని, నామక్కల్ జిల్లాలో ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కాంచన తెలిపారు.