దారుణం.. నడిరోడ్డు మీద బాలికను 14 సార్లు పొడిచిన ప్రేమికుడు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-01T18:18:41+05:30 IST

ఆ యువకుడు ఇంటర్ చదివే యువతిని ప్రేమించాడు. తనను ప్రేమించాలని రెండేళ్లుగా ఆమెను వెంబడిస్తున్నాడు..

దారుణం.. నడిరోడ్డు మీద బాలికను 14 సార్లు పొడిచిన ప్రేమికుడు.. అసలేం జరిగిందంటే..

ఆ యువకుడు ఇంటర్ చదివే బాలికను ప్రేమించాడు. తనను ప్రేమించాలని రెండేళ్లుగా ఆమెను వెంబడిస్తున్నాడు.. అయితే ఆ బాలిక అతగాడి ప్రేమను నిరాకరించింది.. అతని వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు నమోదు చేసి, యువకుడిని అరెస్టు చేశారు.. ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నిందితుడు మళ్లీ ఆ బాలిక వెంటపడ్డాడు.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు.. ఆ తర్వాత నిందితుడు అక్కడే రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


ఇది కూడా చదవండి..

మరీ ఇంత దారుణమా..? కడుపులో బిడ్డ మరణించిందని ఆ 3 నెలల గర్భిణికి చెప్పిన డాక్టర్లు.. కానీ చివరకు..


తమిళనాడులోని తిరుచ్చిలోని అతికుళంలో ఉండే కేశవన్ అనే యువకుడు, ఇంటర్ చదివే బాలికను ప్రేమ పేరుతో రెండేళ్లుగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని కోరుతూ బాలిక వెంటబడ్డాడు. అయితే, ఆ బాలిక మాత్రం కేశవన్ ప్రేమను నిరాకరించింది. అతని వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కేశవన్‌ను అరెస్టు చేశారు. కొన్ని రోజుల అనంతరం కేశవన్ ఇటీవల జైలు నుంచి విడుదలై మళ్లీ ఆ బాలిక కోసం అన్వేషణ సాగించాడు. 


ఆ బాలిక కాలేజీ నుంచి బయటకు వస్తుండగా ఆమె దగ్గరకు వెళ్లాడు. తన ప్రేమను తిరస్కరించినందుకు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆమె హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటూ మరణించింది. బాలికపై దాడి చేసిన తర్వాత కేశవన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Updated Date - 2022-06-01T18:18:41+05:30 IST