రావత్ భౌతికకాయాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌పై పూల వర్షం

ABN , First Publish Date - 2021-12-09T21:27:50+05:30 IST

చెన్నై: తమిళనాడులో త్రివిధ దళాల సారథి బిపిన్‌ రావత్‌ భౌతికకాయన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌పై ప్రజలు పూల వర్షం కురిపించారు.

రావత్ భౌతికకాయాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌పై పూల వర్షం

చెన్నై: తమిళనాడులో త్రివిధ దళాల సారథి బిపిన్‌ రావత్‌ భౌతికకాయన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌పై ప్రజలు పూల వర్షం కురిపించారు. నీల్‌గిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ నుంచి భౌతికకాయాలను సూలూర్ ఎయిర్‌‌బేస్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రజలు రోడ్లకిరువైపులా నిల్చొని పూలు చల్లారు. భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. కూనూర్ సమీపంలో జరిగిన సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య సహా 13 మంది చనిపోయారు. 



అమరులు వీరే..


1) జనరల్‌ బిపిన్‌ రావత్‌


2) మధులికా రావత్‌ 


3)బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ సిద్దర్‌


4) లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌హర్జీందర్‌ సింగ్‌


5) నాయక్‌ గురుసేవక్‌సింగ్‌


6) నాయక్‌ జితేంద్ర కుమార్‌


7) లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌


8) లాన్స్‌ నాయక్‌ బి.సాయితేజ


9) హవల్దార్‌ సత్పాల్‌


10) వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్‌


11) స్క్వాడ్రన్‌ లీడర్‌ కె.సింగ్‌


12) జేడబ్ల్యూవో ప్రదీప్‌


13) జేడబ్ల్యూవో దాస్‌  





Updated Date - 2021-12-09T21:27:50+05:30 IST