కొవిడ్ టీకా తప్పనిసరి కాదు...TamilNadu సర్కారు ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-04-04T13:52:39+05:30 IST

కొవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ టీకాలపై సంచలన నిర్ణయం తీసుకుంది....

కొవిడ్ టీకా తప్పనిసరి కాదు...TamilNadu సర్కారు ఉత్తర్వులు

చెన్నై: కొవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ టీకాలపై సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో సందర్శించే వ్యక్తులకు కొవిడ్ టీకా తప్పనిసరి అని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు సర్కారు ఉపసంహరించుకుంది. తప్పనిసరి కొవిడ్ టీకా నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ ఇతర కొవిడ్-19 ప్రోటోకాల్‌లు అమలులో ఉంటాయని పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం తెలిపింది.‘‘తమిళనాడు రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు తగ్గిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ద్వారా కొవిడ్-19ని నిరోధించడానికి విధించిన అన్ని పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించాం. తమిళనాడు 92 శాతానికి పైగా వ్యాక్సినేషన్ కవరేజీని సాధించింది. 


అయితే 18 ఏళ్లు పైబడిన వారికి వరుసగా మొదటి రెండవ డోసు వేసేందుకు తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1939 కింద జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించాం’’ అని సర్కారు పేర్కొంది.అయితే సామాజిక దూరాన్ని పాటించడం, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలను అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాలని ఆరోగ్య శాఖ అధికారులను సర్కారు ఆదేశించింది.


Updated Date - 2022-04-04T13:52:39+05:30 IST