తమిళనాడులో మరో 48 మందికి కరోనా.. 738కి చేరిన కోవిడ్-19 కేసులు..

ABN , First Publish Date - 2020-04-09T00:51:54+05:30 IST

తమిళనాడులో ఇవాళ కొత్తగా మరో 48 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా..

తమిళనాడులో మరో 48 మందికి కరోనా.. 738కి చేరిన కోవిడ్-19 కేసులు..

చెన్నై: తమిళనాడులో ఇవాళ కొత్తగా మరో 48 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 738కి చేరినట్టు ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఇవాళ సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 738కి చేరింది. ఇవాళ 48 మందికి కోవిడ్-19 పాజిటివ్ ఫలితాలు రాగా.. అందులో 42 మంది  ‘‘ఒకే కార్యక్రమం’’ ద్వారా కరోనా బారిన పడ్డారు..’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 738 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 679 మందికి ‘‘ఒకే కార్యక్రమం’’ ద్వారా వైరస్ సోకినట్టు బీలా రాజేశ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-09T00:51:54+05:30 IST