2బాటిళ్లలో స్నేహితులు తెచ్చిన గిఫ్ట్ చూసి నోరెళ్లబెట్టిన వధూవరులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-04-08T21:06:00+05:30 IST

అందంగా ముస్తాబై స్టేజీ మీదకు వచ్చిన నూతన దంపతులు.. స్నేహితులు 2 బాటిళ్లలో తీసుకొచ్చిన గిఫ్ట్‌ చూసి షాకయ్యారు. వీటిని కూడా గిఫ్ట్‌గా ఇస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి

2బాటిళ్లలో స్నేహితులు తెచ్చిన గిఫ్ట్ చూసి నోరెళ్లబెట్టిన వధూవరులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: అందంగా ముస్తాబై స్టేజీ మీదకు వచ్చిన నూతన దంపతులు.. స్నేహితులు 2 బాటిళ్లలో తీసుకొచ్చిన గిఫ్ట్‌ చూసి షాకయ్యారు. వీటిని కూడా గిఫ్ట్‌గా ఇస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అవే కాస్ట్లీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ నూతన వధూవరులకు వాళ్ల స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..



తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాకు చెందిన గిరీష్ కుమార్, కీర్తన ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో బంధుమిత్రుల సమక్షంలో తాజాగా ఒక్కటయ్యారు. వివాహానంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కోసం అందంగా ముస్తాబై స్టేజీ మీదకు చేరుకున్నారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి వధూవరులతో ఫొటోలు దిగడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న స్నేహితులు.. ఆ నూతన జంటకు వెరైటీ గిఫ్ట్ ఇచ్చారు. ఓ బాటిల్ డిజిల్, మరో బాటిల్‌లో పెట్రోల్‌ను తీసుకొచ్చి.. వధూవరుల చేతికి అందించారు. అది చూసి తొలిత షాకైన ఆ జంట.. తర్వాత నవ్వుతూ ఆ గిఫ్ట్‌లను తీసుకున్నారు. రోజురోజుకూ పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుతున్న క్రమంలో ఫన్నీగా ఉంటుందని వాటిని గిఫ్ట్‌లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. కాగా.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.




Updated Date - 2022-04-08T21:06:00+05:30 IST