కోవిడ్ వారియర్లకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
ABN , First Publish Date - 2021-05-12T20:49:23+05:30 IST
కోవిడ్ వారియర్లకు రూ.25 లక్షల చొప్పున స్టాలిన్ పరిహారం..
చెన్నై: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రేయింబవళ్లు శ్రమించి, విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్ల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని బుధవారంనాడు ప్రకటించారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన మెడికల్ ప్రొఫెషనల్స్కు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్స్) కూడా సీఎం ప్రకటించారు. వైద్యులకు రూ.30,000, నర్సులకు రూ.20,000, ఇతర వర్కర్లకు రూ.15,000 ఇన్సెన్టివ్లు ఇస్తామన్నారు. పీజీ స్టూడెంట్లు, ట్రెయినీ డాక్టర్లకు కూడా రూ.20,000 ఇన్సెన్టివ్ను సీఎం ప్రకటించారు.