మరణ వార్తపై తాలిబన్ కో-ఫౌండర్ వాయిస్ మెసేజ్

ABN , First Publish Date - 2021-09-14T03:04:49+05:30 IST

నా సోదరులు, మిత్రులకు ముఖ్యమైన సమాచారం. నేను చనిపోయానని మీడియాలో వార్త వచ్చింది. కొద్ది రోజుల నుంచి నేను ట్రిప్‌లో ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాననేది అప్రస్తుతం. అయితే క్షేమంగా ఉన్నాననేది వాస్తవం. మీడియా ఎప్పుడూ ప్రచారం ఆధారంగా వార్తలు రాస్తుంటుంది.

మరణ వార్తపై తాలిబన్ కో-ఫౌండర్ వాయిస్ మెసేజ్

కాబూల్: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, అఫ్ఘాన్ ప్రస్తుత ఉప ప్రధానమంత్రి అబ్దుల్ ఘని బరాదర్ చనిపోయినట్లు వస్తున్న వార్తలను స్వయంగా ఆయనే ఖండించారు. తాజాగా విడుదల చేసిన ఒక వాయిస్ మెసేజ్‌లో తాను ఆరోగ్యంగానే ఉన్నానని, మీడియా సంచనాల కోసం తప్పుడు వార్తలు రాస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఖతార్‌లో ఉంటున్న తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ బలపరిచారు. మరణ వార్త పూర్తిగా ఆధార రహితమైన సమాచారమని, తాను బతికున్నట్లు బరాదర్‌నే వాయిస్ మెసేజ్ ద్వారా వివరణ ఇచ్చారని చెప్పుకొచ్చారు.


‘‘నా సోదరులు, మిత్రులకు ముఖ్యమైన సమాచారం. నేను చనిపోయానని మీడియాలో వార్త వచ్చింది. కొద్ది రోజుల నుంచి నేను ట్రిప్‌లో ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాననేది అప్రస్తుతం. అయితే క్షేమంగా ఉన్నాననేది వాస్తవం. మీడియా ఎప్పుడూ ప్రచారం ఆధారంగా వార్తలు రాస్తుంటుంది. అన్ని వార్తలను నేను చాలా ధైర్యంగా ఖండిస్తున్నాను. ఒకవేళ నేను చనిపోయినట్లు మీడియా 100 శాతం నొక్కి చెప్పినా నాకు ఎలాంటి సమస్య లేదు’’ అని బరాదర్ చెప్పినట్లు విడుదలైన వాయిస్ మెసేజ్‌లో ఈ విధంగా చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-09-14T03:04:49+05:30 IST