తైబాక్సింగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-12-07T05:35:32+05:30 IST
హైదరాబాద్లో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఏసియన్ అంతర్జాతీయ తైబాక్సింగ్ పోటీల్లో ప్రొద్దుటూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో హేమశ్రీ బంగారు పతకం, సిరి చందన రజత పతకం, హేమవందన కాంస్య పతకం సాధించారు.
ప్రొద్దుటూరు టౌన్, డిసెంబరు 6: హైదరాబాద్లో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఏసియన్ అంతర్జాతీయ తైబాక్సింగ్ పోటీల్లో ప్రొద్దుటూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో హేమశ్రీ బంగారు పతకం, సిరి చందన రజత పతకం, హేమవందన కాంస్య పతకం సాధించారు. అండర్ -12 సబ్ జూనియర్ బాలుర విభాగంలో సాత్విక్, పునీత్రెడ్డి, రజత పతకాలు, అండర్-9 విభాగంలో సాయి సాత్విక్రెడ్డి, సుదీ్పకుమార్, మహిరెడ్డి కాంస్య పతకాలు సాధించారు. అండర్-12 విభాగంలో రామ్ చరణ్రెడ్డి, శరత్ శంకర్రెడ్డి కాంస్య పతకాలు సాధించగా, బంగారు పతకం సాధించిన హేమశ్రీ ఫిబ్రవరిలో థాయిల్యాండ్లో నిర్వహించిన అంతర్జాతీయ తైబాక్సింగ్ పోటీల్లో పొల్గొంటుందని మాస్టర్ మునీశ్వర్ తెలిపారు.