తైబాక్సింగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-03-02T05:07:04+05:30 IST
జాతీయస్థాయి తైబాక్సింగ్ ఫెడరేషన్ చాంపియన్షిప్ పోటీలను వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూలు జవహర్ బాలకేంద్రం విద్యార్థులు ప్రతిభ కనపరి చారని మాస్టర్ మునీశ్వర్ తెలిపారు.
ప్రొద్దుటూరు టౌన్, మార్చి 1: జాతీయస్థాయి తైబాక్సింగ్ ఫెడరేషన్ చాంపియన్షిప్ పోటీలను వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూలు జవహర్ బాలకేంద్రం విద్యార్థులు ప్రతిభ కనపరి చారని మాస్టర్ మునీశ్వర్ తెలిపారు. హైదరాబాదు కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లోఓ ప్రొద్దుటూరు విద్యార్థులు అండర్-12 బాలికల విభాగంలో హేమశ్రీ, బాలుర విభాగంలో యశ్వంత్ బంగారు పతకాలు సాధించగా బాలికల విభాగంలో శిరిచందన, హేమవందన, నాగలక్ష్మి, హర్షిత, లాస్యప్రియ, బాలుర విభాగంలో శివవసం త్, జగన్మోహన్రెడ్డిలు వెండిపతకాలు సాధించారని అండ ర్-19 బాలికల విభాగంలో దీపికారెడ్డి, బాలుర విభాగంలో నితేష్ కాంస్య పతకాలు సాఽధించారని తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను జిల్లా తైబాక్సింగ్ అసోసియేషన్ ఉ పాధ్యక్షుడు డాక్టర్ కాలువ నాగేంద్రలు విద్యార్థులను అభినం దించారు.