జిల్లాస్థాయి పోటీల్లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-01-26T05:59:42+05:30 IST

జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కెజిబివిలో జరిగిన వకృత్వ పోటీలలో స్థానిక కెజిబివి జూనియర్‌ కళాశాల విద్యార్థి కె.కల్పన మొదటి బహుమతి సాధించినట్లు ప్రిన్పిపాల్‌ సజన తెలిపారు.

జిల్లాస్థాయి పోటీల్లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
విద్యార్థిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

సీఎ్‌సపురం, జనవరి 25 : జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కెజిబివిలో జరిగిన వకృత్వ పోటీలలో స్థానిక కెజిబివి జూనియర్‌ కళాశాల విద్యార్థి కె.కల్పన మొదటి బహుమతి సాధించినట్లు ప్రిన్పిపాల్‌ సజన తెలిపారు. గెలుపొందిన బహుమతి రూ.10వేలు, ప్రశంసాపత్రాన్ని ఈ నెల 26వ తేదీన కలెక్టర్‌ చేతులమీదుగా విద్యార్థికి అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్బంగా విద్యార్థినికి పాఠశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

వక్తృత్వ పోటీల్లో కేజీబీవీ విద్యార్థి ప్రతిభ

పీసీపలి :స్థానిక కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న భూమిరెడ్డి శృతి జిల్లాస్థాయి వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. బాలికా దినోత్సవం సంధర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో జిల్లాస్థాయి వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ‘సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌’ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో తృతీయ స్థానంలో విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన శృతికి నిర్వాహకులు రూ.3 వేల నగదు బహుమతిని అందజేశారు. మంగళవారం కేజీబీవీ లో విద్యార్ధిని శృతిని ప్రిన్సిపాల్‌ బి.సుజాత సిబ్బంది అభినందించారు.

Updated Date - 2022-01-26T05:59:42+05:30 IST