ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తున్నారు: తలసాని

ABN , First Publish Date - 2021-04-13T18:25:07+05:30 IST

ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తున్నారు: తలసాని

ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తున్నారు: తలసాని

హైదరాబాద్: కార్యకర్త ఇంట్లో ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు ఎంతో ఆనందంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా టీఆర్ఎస్ పార్టీని నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారని చెప్పారు. ఈ నెల 14 న హాలియాలో సీఎం కేసీఆర్ సభకు ఉత్సాహంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్దమవుతున్నారన్నారు. 

Updated Date - 2021-04-13T18:25:07+05:30 IST