గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష

ABN , First Publish Date - 2022-06-21T18:16:25+05:30 IST

ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు.

గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్‌ : ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తించారన్నారు. ముఖ్యమంత్రి KCR ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తలసాని తెలిపారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. విశ్వవ్యాప్తమైన తెలంగాణ బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని తెలిపారు.


Updated Date - 2022-06-21T18:16:25+05:30 IST