కోవిడ్ నిబంధనలతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి: తలసాని

ABN , First Publish Date - 2022-01-16T21:32:45+05:30 IST

తెలుగు లోగిళ్ళ లో సంబురాలు తీసుకొచ్చేదే సంక్రాంతి పండుగ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

కోవిడ్ నిబంధనలతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలి: తలసాని

హైదరాబాద్: తెలుగు లోగిళ్ళ లో సంబురాలు తీసుకొచ్చేదే సంక్రాంతి పండుగ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో రెండెో రోజు ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ లో  మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పతంగులను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే  ఇంటి ముందర రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మ ల తో అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.


అంతేకాకుండా పిండి వంటలతో పల్లె, పట్టణం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సంక్రాంతి పండుగ ను ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పండుగ వేడుకలలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-16T21:32:45+05:30 IST