మురుగునీటి పారుదలకు చర్యలు
ABN , First Publish Date - 2022-05-24T06:23:11+05:30 IST
మురుగునీటి పారుదలకు చర్యలు తీసుకుంటు న్నామని కైకలూరు సర్పంచ్ నవరత్నకుమారి తెలిపారు.
పాత తూముల స్థానంలో కొత్తవి ఏర్పాటు
యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
కైకలూరు, మే 23: మురుగునీటి పారుదలకు చర్యలు తీసుకుంటు న్నామని కైకలూరు సర్పంచ్ నవరత్నకుమారి తెలిపారు. సోమవారం ఆంధ్రజ్యోతిలో ‘రహదారిపైనే మురుగు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి సర్పంచ్, అధికారులు స్పందించారు. పాత తూములను తొలగించి వాటి స్థానంలో కొత్తవి వేశారు. పూడికతీత పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. డ్రెయిన్లను ఆక్రమించి షాపులు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తొలగింపులో తహసీల్దార్ వై.రంగారావు, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.