భద్రత చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2021-03-02T05:29:03+05:30 IST
మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి పటిష్ఠ భద్రత చర్యలను చేపట్టాలని ఎన్నికల ప్రత్యేకాధికారి కూర్మనాథ్ పోలీసు అధికారులను కోరారు.
పార్వతీపురంటౌన్: మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి పటిష్ఠ భద్రత చర్యలను చేపట్టాలని ఎన్నికల ప్రత్యేకాధికారి కూర్మనాథ్ పోలీసు అధికారులను కోరారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో స్ట్రాంగ్ రూంలను డీఎస్పీ సుభాష్, సీఐ లక్ష్మణరావు, పోలీసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలతో పాటు ఎన్నికలను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించారు. ఓటు హక్కును ఓటరు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు మనమంతా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ఓట్ల లెక్కింపు అయ్యే వరకు స్ట్రాంగ్ రూంకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.